. < 1 minute

మాతా, శిశు మరణాలను అరికట్టాలి : కలెక్టర్ హనుమంతరావు

Caption of Image.

యాదాద్రి, వెలుగు : మాతా, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​హనుమంతరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో ఈ ఏడాది జరిగిన మాతా, శిశు మరణాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సంభవించిన 52 మంది తల్లులు, 25 మంది శిశు మరణాలు జరిగినట్టుగా హెల్త్​ స్టాఫ్​ వివరించారు. 

శిశు మరణాల్లో బరువు తక్కువగా పుట్టడం, గుండె సంబంధిత కారణాల వల్ల మరణాలు సంభవించినట్టు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు జాగ్రత్తలు  తీసుకుంటే మరణాల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సామాజిక సేవా దృక్ఫథంతో డాక్టర్లు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. 

సదుపాయాలు  కల్పించాలి..

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదివే స్టూడెంట్స్​కు అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్టూడెంట్స్​ను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం రాజాపేట మండలం బూరుగుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, తహసీల్దార్​ఆఫీసులో భూభారతి అప్లికేషన్లను పరిశీలించారు. 

ఎస్సీ రెసిడెన్షియల్​ స్కూల్​ను సందర్శించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో అడిషనల్​కలెక్టర్​భాస్కర్​రావు, డీఆర్​డీవో నాగిరెడ్డి, డీఈవో సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, డీఎంహెచ్​వో డాక్టర్ మనోహర, డిప్యూటీ డీఎంహెచ్​వో యశోద పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.