. 2 minutes

చంద్రబాబు.. ఈసారి మా వాళ్లు నేను చెప్పినా వినరు : జగన్

Caption of Image.

బుధవారం ( జులై 16 ) తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించిన వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. భయానక వాతావరణం నెలకొందని అన్నారు. చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి తెర తీశారని.. తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు జగన్. రేపటి రోజున మీరు కుర్చీ దిగి మేము ఎక్కుతామని అన్నారు. ఈ సారి మావాళ్లు నేను చెప్పినా వినరని అన్నారు జగన్.

దెబ్బతిన్న వైసీపీ నేతలంతా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిచర్య చేపడితే మీ పరిస్థితి ఏంటని అన్నారు జగన్. చంద్రబాబు వేసిన విత్తనమే రేపటి రోజున చెట్టు అవుతుందని.. తాము అధికారంలోకి వచ్చాక ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు జగన్. రాష్ట్రంలో చట్టాలు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఏపీలో ఒక్కటే ప్రతిపక్ష పార్టీ ఉందని.. మిగతా ప్రధాన పార్టీలన్నీ టీడీపీతో అధికారాన్ని పంచుకుంటున్నాయని అన్నారు. 

ALSO READ : జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించండి: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ

ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న ఏకైక పార్టీ వైసీపీ అని.. ఏ వర్గానికి ఏ కష్టం వచ్చినా వైసీపీనే ముందుంటుందని అన్నారు జగన్. సూపర్ సిక్స్ హామీలు వదిలేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పార్టీ వైసీపీనే అని.. ప్రజలకు సంఘీభావంగా గొంతు కలపటం.. అండగా నిలబడటం చేస్తుంది వైసీపీ నేనని అన్నారు జగన్. గత ఏడాది కాలంగా ప్రజలను అన్నీ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. రైతన్నల గిట్టుబాటు ధరల కోసం వారికి అండగా నిలిచామని.. 2024 డిసెంబర్ 13వ తేదీన అన్నదాతకు అండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించామని అన్నారు. డిసెంబర్ 24న కరెంట్ ఛార్జీల బాదుడుపై పోరుబాట నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. 

విద్యార్ధుల ఇబ్బందులను ప్రశ్నించేందుకు మార్చి 12న యువత పోరు పేరిట వారికి అండగా నిలదీసామని.. జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా చంద్రబాబు ఎగ్గొట్టిన హామీలపై గట్టిగా నిలదీసామని.. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం చేశామని అన్నారు. ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమం చేస్తున్నామని.. బాబు ష్యూరిటీ అంటూ ప్రజలకు కూటమి పార్టీలు ఇచ్చిన బాండ్లపై వారి మోసాలు ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు జగన్. 

రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజలను చైతన్య వంతులను చేసేలా కార్యక్రమాల చేపట్టామని.. గతంలో వారిచ్చిన బాండ్లు, చంద్రబాబు ఒక్కొక్కరికీ ఎంత బాకీ ఉన్నాడనే విషయం తెలియజేసే కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని అన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చంద్రబాబు దగ్గరకు వెళ్ళటం లేదని.. వైసీపీ తలుపు తడుతున్నారని అన్నారు జగన్. ఇది చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని.. ప్రజల గొంతును నొక్కివేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మరో మూడేళ్లు ఆగితే తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుంది.. మన సమస్యలు తీరతాయని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు జగన్. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.