. 2 minutes

శుభంగా భూమికి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా : కాలిఫోర్నియాలో స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్

Caption of Image.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్.. (ISS) నుంచి భూమిపైకి క్షేమంగా దిగారు ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. 2025, జూలై 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వీరి స్పేస్ క్రాఫ్ట్ కాలిఫోర్నియా తీరంలోని సముద్రంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 22 గంటల ప్రయాణం తర్వాత భూమికి సురక్షితంగా తిరిగివచ్చింది. 

శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోస్ట్ డిజ్నాన్స్, టిబర్ కపు కూడా శుభాంశు శుక్లాతో ఉన్నారు. శుభాంశు టీమ్ క్షేమంగా ల్యాండ్ అవటంతో నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని అభినందనలు తెలపుకున్నారు.  శుక్లా కుటుంబ సభ్యులు ఆనంద భాష్పాలు రాల్చారు. 

యాక్జియం-4 (Axiom-4) మిషన్ లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా టీమ్.. క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. మంగళవారం (జులై 15) మధ్యాహ్నం డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కాలిఫోర్నియా లోని శాన్ డియాగో తీరంలో లాండ్ అయ్యింది. 20 రోజుల మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లా ఆధ్వర్యంలో యాత్ర, పరిశోధనలను పూర్తి చేసుకుని శుభంగా, క్షేమంగా భూమికి చేరుకున్నారు.

సోమవారం (జులై 14) స్పేస్ స్టేషన్ నుంచి బయల్దేరిన డ్రాగన్ క్రాఫ్ట్.. సాయంత్రం 4.30 గంటలకు అన్ డాకింగ్ పూర్తి కావడంతో ప్రయాణం మొదలైంది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చేరుకోవడానికి మొత్తం సమయం 22 గంటల 5 నిమిషాలు పట్టింది. 

తిరుగు ప్రయాణంలో భూ కక్షలోకి వచ్చిన స్పేస్ షిప్.. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో డీ ఆర్బిట్ బర్న్ (deorbit burn) పూర్తి కావడంతో భూ వాతావరణంలోకి ఎంట్రీ అయ్యింది. డీ ఆర్బిట్ బర్న్ సందర్భంగా 7 నిమిషాల పాటు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ కోల్పోతుందని ముందుగానే నాసా ప్రకటించింది. మొత్తం డీఆర్బిట్ బర్న్ కు 18 నిమిషాల సమయం పట్టింది. 

స్పేస్ షిప్ కాలిఫోర్నియా సముద్ర తీరంలోకి చేరిన తర్వాత స్ప్లాష్ డౌన్  (Splashdown) సమయం 16 నిమిషాలుగా నాసా ప్రకటించింది. స్ప్లాష్ డౌన్ అంటే.. స్పేస్ షిప్ నుంచి పారా చూట్ ల సహాయంతో క్రూ మెంబర్స్ ను దించే సమయం. 

7 రోజుల క్వారంటైన్:

యాక్సియం 4 మిషన్​లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లిన ఇండియన్ అస్ట్రొనాట్ శుభాంశు శుక్లా భూమిపై ల్యాండ్ అయిన వెంటనే 7 రోజుల క్వారంటైన్​కు తరలిస్తారు. మంగళవారం (జులై 15)  మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియాలోని కోస్టల్ ఏరియాలో శుక్లాతో పాటు మరో ముగ్గురు అస్ట్రొనాట్లు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉజ్నాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీ-విస్నియొస్కీ, టిబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపులు ల్యాండ్ అయ్యారు. 

అస్ట్రొనాట్లను 7 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచనున్నట్లు ఇస్రో తెలిపింది. స్పేస్​లో గ్రావిటీ ఉండదు. ఇక్కడికొచ్చాక శుక్లా భూ వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు ఇస్రోకు చెందిన డాక్టర్లు శుక్లా హెల్త్ కండీషన్, ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. స్పేస్​లో శుభాంశు శరీరంపై పడిన ప్రభావంపై అధ్యయనం చేస్తారు.

శరీరంలో రక్త ప్రవాహం, గుండెతో పాటు మెదడు పనితీరును స్పేస్ జర్నీ ఎలా ప్రభావితం చేసిందనే విషయాలను పరిశీలిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ గంటకు 28వేల కిలో మీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. భూ వాతావరణంలో ప్రవేశించాక క్రమంగా స్పీడ్ తగ్గిస్తూ ఉంటారు. కాగా, నలుగురు అస్ట్రొనాట్లు గతనెల 25న ఐఎస్ఎస్​కు బయలుదేరి వెళ్లారు. 18 రోజుల పాటు అందులోనే ఉన్నారు. రెండు వారాల్లో శుక్లా దాదాపు 96.5 లక్షల కిలో మీటర్లు ప్రయాణించాడు. 230 సార్లు భూమి చుట్టూ తిరిగారు. 

18 రోజులపాటు 60 ప్రయోగాలు.. 

శుక్లా టీమ్.. ఐఎస్ఎస్​లో 18 రోజులు ఉన్నారు. స్పేస్ స్టేషన్ లో ఉన్న 18 రోజులతో పాటు ప్రయాణానికి సంబంధించిన అన్ని రోజులు కలిపి 20 రోజులు పూర్తి చేసుకున్నారు. 20వ రోజు భూమిపై తిరిగి కాలుమోపనున్నారు. భార రహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై మొత్తం 60 ప్రయోగాలు చేశారు. వీటిలో ఇస్రో తరఫున శుభాంశు 7 ముఖ్యమైన ప్రయోగాలు చేశారు. దీంతో పాటు నాసా నిర్వహించే 5 జాయింట్ స్టడీస్​లోనూ శుక్లా పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.